AP: కుమారుడి చేతిలో తండ్రి హతం
ఒంగోలు : మద్యం మత్తులో తండ్రిని కొడుకు రంపంతో కోసి చంపిన ఘటన ఏపీలో కలకలం రేపింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు గ్రామంలో చోటు చేసుకుంది..
ఎస్సీ కాలనీలో పైడిపోగు యేసయ్య (64) ని అతడి కొడుకు మరియ దాసు హత్య చేశాడు. నిద్రలో ఉన్న తండ్రిని చంపి.. రంపంతో కోశాడు. ఆ యువకుడిని స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.