హైదరాబద్ : నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
తాజాగా, నగరంలోని పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, కృష్ణానగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం మోదలైంది.
కాగా, ఈ రోజు నుంచి మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.