ఆంధ్రప్రదేశ్‌లో ప్యూర్ కొత్త షోరూమ్…

అనకాపల్లి : భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ప్యూర్, ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో తమ సరికొత్త షోరూమ్ శ్రీ సాయి లక్ష్మీ ఈ బైక్స్ ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ కొత్త షోరూమ్ తో భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతుంది.

ఈ ప్రారంభోత్సవం గురించి ప్యూర్ సిఇఒ & సహ వ్యవస్థాపకుడు శ్రీ రోహిత్ వదేరా మాట్లాడుతూ, “మా అత్యాధునిక ఎలక్ట్రిక్ రవాణా, ఇంధన నిల్వ ఉత్పత్తులను అనకాపల్లికి తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్, వెలుపల మా నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నందున, ఈ షోరూమ్ మా అధునాతన ఈవీ సాంకేతికత, క్లీన్ ఎనర్జీ ఆవిష్కరణలను కస్టమర్లు ప్రత్యక్షంగా తిలకించటానికి కీలకమైన టచ్‌పాయింట్‌గా ఉపయోగపడుతుంది. మా అధిక-పనితీరు గల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే కాకుండా మా విప్లవాత్మక ప్యూర్ పవర్ ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులను కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడం సంతోషంగా ఉంది ” అని అన్నారు.

ప్యూర్ అనకాపల్లి షోరూమ్‌లో eTryst X, ePluto 7G MAX, ecoDryft, ETRANCE Neo+ వంటి వాహనాలతో పాటుగా బ్రాండ్ తాజా ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణి కూడా అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక ప్రారంభోత్సవ ఆఫర్‌గా, షోరూమ్‌ను సందర్శించే కస్టమర్‌లకు రూ. 5,000/- విలువైన ఉచిత ఉపకరణాలు, పొడిగించిన వారంటీపై 50% తగ్గింపు లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *