House Fire | కర్ణాటకలో క‌ల‌క‌లం

House Fire | కర్ణాటకలో క‌ల‌క‌లం

  • ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు
  • బళ్లారిలోని మోడల్ హౌస్‌కు నిప్పు పెట్టిన దుండగులు
  • ఇటీవల ఇరు వర్గాల మధ్య కాల్పుల ఘటన నేపథ్యంలో కలకలం
  • ఘటనపై కేసు నమోదు.. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

House Fire | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కర్ణాటకలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారిలోని మోడల్ ఇంటికి దుండగులు నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యేనని, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులే దీని వెనుక ఉన్నారని గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు సోమశేఖర రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనతో బళ్లారి రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంది.

House Fire

కర్ణాటక రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓ భవనాన్ని దుండగులు దగ్ధం చేశారు. బళ్లారి కంటోన్మెంట్ ప్రాంతంలో నిన్న‌ సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

House Fire | ఎమ్మెల్యే భ‌ర‌త్‌రెడ్డి ప‌నే..?

ఈ ఘటన వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు ఉన్నారని గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి ఆరోపించారు. భవనంపై పెట్రోల్, డీజిల్ పోసి ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ నెల‌ 1న గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వివాదం సద్దుమణగక ముందే ఇప్పుడు ఈ అగ్నిప్రమాదం జరగడం గమనార్హం.

House Fire | బళ్లారి నగరంలోని ‘జీ స్క్వేర్ లేఅవుట్‌లో..

ఈ సంఘటన బళ్లారి నగరంలోని ‘జీ స్క్వేర్ లేఅవుట్’లో వెలుగుచూసింది. ఇక్కడ గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఒక ‘మోడల్ హౌస్’ ఉంది. ఇది సుమారు 109 ఎకరాల నివాస స్థలంలో ఉంది. ఈ స్థలం గాలి జనార్ధన్ రెడ్డి మరియు శ్రీరాములు పేర్లపై రిజిస్టర్ అయి ఉంది. సుమారు 13-14 ఏళ్ల క్రితం కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఈ మోడల్ హౌస్‌ను నిర్మించారు. ప్రస్తుతం దీని విలువ రూ. 3 కోట్లకు పైగానే ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో దుండుగులు దీనికి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది.

House Fire | బెంగ‌ళూరులో గాలి జ‌నార్ద‌న్ రెడ్డి..

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల కోసం గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ, ఇటీవల బ్యానర్ల గొడవ తర్వాత ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బళ్లారి ఎస్పీతో మాట్లాడానని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ ఘటనతో బళ్లారిలో ఇరువర్గాల మధ్య రాజకీయ వైరం మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

House Fire | ఇది కావాల‌నే చేశారు..

గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి మాట్లాడుతూ.. భవనంపై పెట్రోల్, డీజిల్ పోసి నిప్పు పెట్టారని ఆరోపించారు. ఇది కావాలనే చేసిన పని అని, దీని వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు ఉన్నారని ఆయన ఆరోపించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Leave a Reply