కందిరీగల దాడిలో 25 మంది..
ఇచ్చాపురం, ఆంధ్రప్రభ : ఇచ్ఛాపురం మండలం బలరాంపురం(Balarampuram)లో కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని తోటల్లో అదే గ్రామానికి చెందిన 40 మంది వన భోజనాల కోసం వంటలు సిద్ధం చేస్తుండగా ఒక్కసారిగా కందిరీగలు(Wasps) దాడి చేసాయి.
ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. వెంటనే ఇచ్చాపురంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి(Hospital)కి తరలించగా వారికి వైద్యులు చికిత్సలు అందించారు.

