కడెం, జూన్ 24 (ఆంధ్రప్రభ) : కడెం మండలంలోని పెద్దూర్ తాండ (Peddur Thanda) గ్రామానికి చెందిన యువకుడు హపావత్ సురేష్ (22) తాగిన మైకంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హపావత్ సురేష్ (Suresh) కూలీ పనులు చేస్తూ గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు.
ఎప్పటిలాగే మంగళవారం అధిక మద్యం తాగి, తాగిన మైకంలో జీవితంపై విరక్తి చెంది పెద్దూర్ గ్రామ శివారున ఉన్న డబుల్ బెడ్ రూమ్ లోని తన గదిలో నైలాన్ తాడుతో సీలింగ్ ఫ్యాన్ రాడ్ కు ఉరివేసుకొని ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. మృతునికి ఒక అన్న, తల్లి ఉన్నారు. మృతుని తల్లి హపావత్ అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కడెం పి.ఏస్ ఎస్సై యమ్ కృష్ణసాగర్ రెడ్డి తెలిపారు.