Yashaswini Reddy | ఓటు వేసి ఆశీర్వదించండి..
Yashaswini Reddy | పెద్దవంగర, ఆంధ్రప్రభ: సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు లొట్లబండ తండా గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జాటోత్ పరమేష్ తరఫున ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తండాలో అభివృద్ధిలో వెనుకబడిన అంశాలు చాలా ఉన్నాయని, సర్పంచ్ స్థాయిలో బలోపేతమైన నాయకత్వం అవసరం అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, విద్యావంతుడు జాటోత్ పరమేష్ నాయక్ను గెలిపిస్తే ఈ సమస్యలన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

