Vikarabad | నేడు జిల్లా కేంద్రంలో నీట్ పరీక్ష.. హాజరు కానున్న 1193 మంది

వికారాబాద్, మే 4 ( ఆంధ్రప్రభ): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు నీట్ పరీక్ష నిర్వహిస్తున్నట్టు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తెలిపారు. ఈ పరీక్షకు 1193 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, ఎన్నేపల్లి సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాల, కొత్తగాడి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, అనంతగిరిపల్లి గురుకుల పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.

సంబంధిత అభ్యర్థులు పరీక్ష సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని ఆయన పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు కానీ, క్యాలిక్యులేటర్ కానీ అనుమతించరని హాల్ టికెట్ తో పాటు సంబంధిత అభ్యర్థి ఫోటోతో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply