కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చిట్చాట్
హైదరాబాద్ : బీహార్ ఎన్నికల్లో (Bihar elections) బీజేపీకి మంచి వాతావరణం ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఈ రోజు హరిత ప్లాజాలో కిషన్రెడ్డి చిట్చాట్ లో మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్కు అసలు ఒక ఎజెండా లేదన్నారు. రాహుల్ గాంధీ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో కూడా కాంగ్రెస్ నాయకులకే తెలియదన్నారు. ఓట్లు లేవని, డబుల్ ఓట్లు ఉన్నాయని ఆయన విమర్శలు చేస్తున్నారని, లేకుంటే ఓట్లు నమోదు చేసుకోవాలని, రెండు ఓట్లు ఉంటే తొలగిస్తారని అన్నారు. తనకు తాను ఆటం బాంబు పెడుతున్నారని రాహుల్ ఫీల్ అవుతున్నారన్నారు. హైదరాబాద్ (Hyderabad) లో కూడా చాలామందికి రెండు ఓట్లు ఉన్నాయని, వారు ఏదో ఒకచోట ఉంచుకోవాలన్నారు.
అవినీతికి భయపడేవారే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు…
తీవ్రమైన అవినీతి కారణంగా 30రోజులు జైల్లో ఉంటే పోస్టుకు రాజీనామా చేయాల్సిందేనని, జైల్లో ఉండి కూడా రివ్యూ చేస్తారని అంబేద్కర్ కు తెలిసి ఉంటే అప్పుడే రాజ్యాంగంలో ఈ చట్టాన్ని పొందుపరిచేవారమని కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఐదేళ్లకు పైగా జైలులో ఉండేలా శిక్ష పడినట్లయితే పార్టీలకతీతంగా ప్రధాని అయినా కేంద్ర మంత్రులు అయినా, ఎమ్మెల్యేలు అయినా పదవి పోతుందనే బిల్లు ప్రవేశ పెట్టామని చెప్పారు. తామెందుకు ఈ చట్టంతో వారిని అనవసరంగా జైల్లో వేస్తామని, అవినీతికి భయపడే వారు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో (three states) ఇప్పుడు ఎన్నికలు పెడితే ఆ పార్టీని ప్రజలే ఓడిస్తారని కిషన్రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇన్ సైడ్ గా అంతా సెట్ చేసుకుంటున్నామన్నారు.
అధికార దుర్వినియోగం జరిగింది…
కాళేశ్వరం అంశంపై అధికార దుర్వినియోగం జరిగిందని కిషన్రెడ్డి అన్నారు. నిర్మాణంలో తప్పు చేశారని అనేక టీవీ డిబేట్లలో పలువురు రిటైర్ ఇంజినీర్లు చెప్పారన్నారు. ప్రాజెక్టులో లోపాలను మాత్రమే డ్యామ్ సేఫ్టీ అధికారులు (Dam safety officials) చెబుతారని, అంతేకానీ అవినీతి గురించి వారు చెప్పరన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విచారణ సీబీఐకి ఇవ్వాలని లేఖ రాసింది, ఇప్పుడు స్టాండ్ మార్చుకుంది కాంగ్రెస్ అని అన్నారు.