Sunday, September 15, 2024

ADB: అమృత్ పథకంతో తాగునీటి సమస్య పరిష్కారం.. ఎంపీ వంశీకృష్ణ

చెన్నూర్, ప్రభన్యూస్: అమృత్ 2.0 పథకంతో చెన్నూరు పట్టణ ప్రజల తాగునీటి సమస్య దూరమవుతుందని పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో రూ.31కోట్లతో నూతనంగా అమృత్ పథకం ద్వారా నిర్మించ తలపెట్టిన వాటర్ ట్యాంక్ పనులకు తన తండ్రి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార సమయంలో పట్టణంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని గుర్తించడం జరిగిందని, అందులో భాగంగా ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, మున్సిపల్ చెర్ పర్సన్ అర్చన గిల్డా, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement