Monday, July 1, 2024

అంజలి కుటుంబానికి న్యాయం కోరుతూ.. రాజీవ్ రహదారిపై రాస్తారోకో..

గోదావరిఖని, (ప్ర‌భ‌న్యూస్): ప్రేమ పేరుతో ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన యైటింక్లైన్ కాలనీలోని కేకే నగర్ కు చెందిన అంజలి కుటుంబానికి న్యాయం చేయాలని బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారద నగర్ రాజీవ్ రహదారిపై కుటుంబ సభ్యులతో కలిసి యాదవ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు బాధ్యులు మాట్లాడుతూ… సమాజంలో ఎక్కడో ఒక్క చోట మహిళలపై అత్యాచారాలు,హత్యలు వేధింపులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. మహిళలకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే అంజలిని దారుణంగా హత్య చేసిన, చాట్ల రాజును కఠినంగా శిక్షించాలని బహిరంగంగా ఉరి తీయాలని, అంజలి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement