Tuesday, July 23, 2024

Odisha – నైని వ‌స్తే.. సంతోషం! ఉప ముఖ్య‌మంత్రి భట్టి

ఆ బొగ్గు గ‌ని నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించాలి
ఒడిశా సీఎంతో తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భేటీ
ఒడిశా వెళ్లి చ‌ర్చ‌లు జ‌రిపిన‌ భ‌ట్టి విక్ర‌మార్క‌
సింగ‌రేణికి కేటాయించిన నైని బొగ్గు గ‌ని త‌ర్వ‌లో ప్రారంభించాలి
గ‌ని ప్రారంభ‌మైతే రాష్ట్ర ఖ‌జానాకు రూ . 500 కోట్లు ఆదాయం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, హైద‌రాబాద్‌/ భువ‌నేశ్వ‌ర్ : తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఒడిశా ఈ రోజు వెళ్లారు. 2015లో సింగ‌రేణికి ఒడిశాలోని అంగుల్ జిల్లా నైని బొగ్గు గని కేటాయించారు. ఈ బొగ్గు గని ప్రారంభం, నిర్వహణకు సంబంధించిన విష‌యాలను ఒడిశా సీఎం మోహ‌న్ చ‌ర‌ణ్‌తో చ‌ర్చించ‌డానికి భ‌ట్టి వెళ్లారు. లోక్‌సేవా భ‌వ‌న‌లో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌తో కొద్ది సేప‌టి క్రితం తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. నైని బొగ్గు గని పనుల ప్రారంభం, నిర్వ‌హ‌ణ విష‌యంలో త‌మ‌కు స‌హ‌కారం అందించాల‌ని భ‌ట్టి కోరారు. వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

నైని బొగ్గు గనుక సంబంధించిన సమాచారం

- Advertisement -

ఒడిశాలోని అంగుల్ జిల్లాలో నైని బొగ్గు గనిని 2015 సంవత్సరంలో సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ కి కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ‌ కేటాయించింది. నైని బొగ్గు గని యొక్క గరిష్ట స్థాయి సామర్థ్యం ప‌ది ఎంటీపీఏ, 51:49 ఈక్విటీ ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం సంయుక్తంగా యాజమాన్యంలో ఉంది.

నైని ప్రాజెక్టు గ్రౌండింగ్ కు అనుమ‌తులు

నైని ప్రాజెక్ట్ గ్రౌండింగ్ కోసం అవసరమైన అన్ని అనుమతులు మార్చి 23 నాటికి వచ్చాయి. ఇటీవల, ప్రస్తుత ప్రభుత్వ మద్దతుతో, రాష్ట్ర అటవీ శాఖ వారు 04.07.2024 నాటి లేఖ ప్రకారం అటవీ భూమిని ఎస్‌సీసీఎల్‌కి అప్పగించారు.

రాష్ట్ర ఖ‌జానాకు ఆదాయం

నైనీ బొగ్గు గని, పూర్తి సామర్థ్యంతో పనిచేసిన తర్వాత, రాష్ట్ర ఖజానాకు రాయల్టీ, డీఎంఎఫ్‌టీ ఇతర చట్టబద్ధమైన లెవీలు మొదలైనవాటితో సహా సంవత్సరానికి దాదాపు రూ. 500 కోట్ల ఆదాయం సమకూరుతుంది. నైనీ బొగ్గు గని ప్రత్యక్షంగా , పరోక్షంగా దాదాపు 1200 మందికి ఉపాధిని కల్పిస్తుంది.

బొగ్గును స‌ద్వినియోగం కోసం
నైని బొగ్గు గనితో పాటు, నైని బొగ్గు గని నుండి ఉత్పత్తి చేయబడిన బొగ్గును సద్వినియోగం చేసుకోవడానికి అంగుల్ జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంట్‌ను కూడా ఎస్‌సీసీఎల్ నెలకొల్పాలని ప్రతిపాదిస్తోంది. పై పవర్ ప్లాంట్ కోసం ఎస్‌సీసీఎల్ ఫీజిబిలిటీ నివేదికను సిద్ధం చేస్తోంది. విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా చేయడానికి షెడ్యూల్ ప్రకారం నైని బొగ్గు గనిని గ్రౌండింగ్ చేయడానికి ఎస్‌సీసీఎల్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ముందస్తు పరిష్కారం కోసం ఈ క్రింది సమస్యల పరిష్కారానికి సహకరించాల్సిందిగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండి బలరాం నాయక్, ఇంధన శాఖ ఓఎస్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement