Thursday, October 24, 2024

Haryana | గుడ్ మార్నింగ్ కాదు.. స్కూళ్ళలో జైహింద్ అని చెప్పాలి

హర్యానాలో అధికారంలో ఉన్న నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఇక నుంచి పాఠశాలల్లో గుడ్ మార్నింగ్ కి బదులు జై హింద్ అని వాడాలని హర్యానా పాఠశాల విద్యా శాఖ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేసింది.

ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులు టీచర్లకు, తోటి స్నేహితులకు పలకరింపుగా గుడ్‌ మార్నింగ్‌కు బదులుగా జై హింద్‌ అని చెప్పాలని పాఠశాల విద్యా డైరెక్టరేట్ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, దేశంపై గౌరవం, దేశ ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఆలోచనతో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement