Friday, October 18, 2024

JEE మెయిన్‌ ఎగ్జామ్ ​లో నో ఆప్షనల్ క్వశ్చన్స్

క‌రోనా స‌మ‌యంలో వెసులుబాటు
వ‌చ్చే ఏడాది నుంచి తొల‌గిస్తున్న‌ట్టు తెలిపిన ఎన్టీఏ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: జేఈఈ మెయిన్ పరీక్ష విధానంలో కీలక మార్పులు జరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఇక నుంచి సెక్షన్ బీలో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవని తెలిపింది. కరోనా సమయంలో విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు ఏర్పడిన ఆటంకాల నేపథ్యంలో 2021 జేఈఈ మెయిన్స్​లో ఎన్టీఏ మార్పులు చేసింది. సెక్షన్ బీలో 10 ప్రశ్నలు ఇచ్చి 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలని విద్యార్థులకు ఆప్షన్ ఇచ్చింది.

- Advertisement -

ఇక‌మీద‌ట ఆ విధానం ఉండ‌దు..

2024 వరకు అదే విధానాన్ని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ కొనసాగించింది. కాగా, 2025 జేఈఈ పరీక్ష నుంచి ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని తాజాగా ప్రకటించింది. 2021కు ముందు ఉన్న పద్ధతిలోనే పరీక్ష ఉంటుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. సెక్షన్ బీలో 5 ప్రశ్నలే ఇవ్వనున్నట్లు, ఐదింటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుందని తెలిపింది. ఏదైనా సమాచారం లేదా అప్‌డేట్‌ కోసం విద్యార్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్ nta.ac.in లేదా జేఈఈ మెయిన్ వెబ్‌సైట్ jeemain.nta.nic.inని చెక్ చేసుకోవాల‌ని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement