Tuesday, October 8, 2024

BJP | ఈటల, అర్వింద్‌కు కేంద్రంలో కీలక పదవులు !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేంద్రంలో ఈటల, అర్వింద్‌కు కీలక పదవులు దక్కాయి. పార్లమెంట్‌కు చెందిన ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ జాయింట్‌ కమిటీ చైర్మన్‌గా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ నియమితులయ్యారు.

ఈ మేరకు స్పీకర్‌ ఆమోదంతో లోక్‌సభ సచివాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల్లో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సభ్యుడిగా అవకాశం దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement