విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని కూటమి నాయకులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ.ఎం రమేశ్, విజయవాడ ఎం.పీ కేశినేని చిన్ని, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, తదితరులు బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ఆలయంలో అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనలు అందజేసి శాలువాతో సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.