Friday, September 20, 2024

Adilabad – భ‌ర్త చేతిలో భార్య హ‌తం..

దండేపల్లి. ఆగస్టు 19 (ప్రభ న్యూస్) మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసి వందేళ్ల జీవితాన్ని పంచుకొని చివరివరకు నడవాలి అనుకున్న భార్యను హతమార్చాడో భ‌ర్త .. . దండేపల్లి ఎస్ఐ ఉదయ్ కిరణ్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 12గంటలసమయంలో విమల అలియాస్ రజితను ఆమె భర్త నరేష్ పొయ్యి ఊదే గొట్టంతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.. రజిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కాగా, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఆవుల నరేష్ గత 12 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన విమల అలియాస్ రజిత(28)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.. వారికి ముగ్గురు పిల్లలు రిషి (10) జెస్సికా( 5) లవన్ కుమార్ (4) గత కొద్ది సంవత్సరాల నుండి ఇద్దరు మధ్య వివాదం ఏర్పడి తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ నేప‌థ్యంలోనే ఆదివారం రాత్రి ఘ‌ర్ష‌ణ‌లో భార్య హ‌త్య‌కు గురైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement