Thursday, July 4, 2024

TG: యువత స్వయం ఉపాధిని ఎంచుకోవడం హర్షణీయం: నీలం మధు..

ఉమ్మడి మెదక్ బ్యురో : ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత స్వయం ఉపాధిని ఎంచుకొని వ్యాపార రంగంలోకి ప్రవేశించడం హర్ష‌ణీయ‌మ‌ని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
మంగళవారం గుమ్మడిదల మండల కేంద్రంలో ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ఆంజనేయులు, సుధాకర్ ఏర్పాటు చేసిన టీ టైం షాప్ ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ… యువత స్వయం ఉపాధిని ఎంచుకోవడం ద్వారా తమ సొంత కాళ్లపై తాము నిలబడడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ప్రారంభించిన ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆయన అభిలాషించారు. ఈ కార్యక్రమంలో తిరుమలవాస్, బాల్ రాజ్, మల్లేష్, గోపాల్, మహేష్, శ్రీనివాస్, బిక్షపతి రెడ్డి, యాదగిరి, నాగరాజు, వెంకటేశ్, సురేష్, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తధితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement