Sunday, October 6, 2024

TG: బొగత జలపాతం లోయలో పడి… యువ‌కుడు మృతి

వాజేడు, జులై 23 ప్రభ న్యూస్ : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చికుపల్లి బోగత జలపాతం లోయలో పడి యువకుడు మృతిచెందిన సంఘటన మంగళవారం జరిగింది. వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్ గ్రామానికి చెందిన బొనగాని జస్వంత్ (19) అనే యువకుడు తన తోటి మిత్రులైన సాయి కిరణ్, నాగేంద్ర, సుశాంత్ వంశీ గౌస్ కలిసి చీకుపల్లి బొగతను సందర్శించడానికి వచ్చారు.

బొగత అందాలను తిలకించిన వీరు బొగతలో ఇలా స్నానం చేసేందుకు దిగారు.. వర‌ద‌ ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో జస్వంత్ నీటమునిగి గల్లంతయ్యాడు ఈ విషయం తెలుసుకున్న వెంకటాపురం సీఐ బండార్ కుమార్, వెంకటాపురం ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా… యువకుడి మృతదేహం లభ్యమైనది. ఈ యువకుడు వాగ్దేవి కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తోటి మిత్రులతో కలిసివచ్చి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement