Saturday, September 14, 2024

NZB: పసుపు లారీ హైజాక్.. రూ.50లక్షల విలువైన పసుపు మాయం

నవీపేట్, జులై 20 ప్రభ న్యూస్ : రూ.50 లక్షల విలువైన పసుపు లోడ్ తీసుకెళ్తున్న లారీని హైజాక్ చేయగా.. నవీపేట మండలం జన్నేపల్లి వద్ద గురువారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ నగరం నుంచి రెండు రోజుల కిందట పసుపు లోడ్ తో బయలుదేరిన లారీ గుంటూరు వెళ్లాల్సి ఉంది. ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలో కారులో వచ్చిన దుండగులు తాము ఆర్టీఏ అధికారులమని లారీని రోడ్డుపై నిలిపివేశారు. డ్రైవర్ కు ఆనుమానం రాకుండా మత్తు ఇచ్చిట్లు తెలుస్తోంది.

డ్రైవరు స్పృహ కోల్పోవడంతో అతడిని కిందకు దించేశారు. ఆనంతరం లారీని హైజాక్ చేసి నిజామాబాద్ కు తీసుకువచ్చి పలు చోట్ల గురువారం పసుపు విక్రయించారు. తర్వాత జన్నేపల్లికి లారీని తరలించారు. లారీలోని సంచులను ఇతర వాహనాల్లోకి మార్చి అమ్మాలని నిర్ణయించుకున్నారు. నవీపేటకు చెందిన ఓ వ్యక్తి మూడు వాహనాలను తీసుకుని జన్నేపల్లి వెళ్లాడు. అక్కడ లోడ్ నింపుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

పోలీసులు రావడంతో డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పారిపోయారు. కిరాయి కోసం వెళ్లిన వాహన డ్రైవర్లను పోలీసులు పట్టుకుని విచారణ చేస్తున్నారు. పంట విలువ రూ.50 లక్షలు ఉంటుందని అంచనా. నిజామాబాద్ ఒకటో ఠాణాలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement