Thursday, September 19, 2024

TG: ఓసీసీలో పాముకాటుతో కార్మికుడు మృతి..

కాసిపేట, సెప్టెంబర్ 14 (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపనీలో కాంట్రాక్ట్ కార్మికులు సిడాం నవీన్ (27) పాము కాటుకు గురై మృతిచెందగా, మరో కార్మికుడు విశాల్ దూబేకు గాయాలయ్యాయి.

తెలిసిన‌ సమాచారం మేరకు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించే కార్మికులు వారికి కేటాయించిన బ్యారెక్ లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శనివారం తెల్లవారుజామున‌ విషపాము నవీన్ ను కాటు వేసిందని, దాని చూసి భయాందోళనకు గురైన మరో కార్మికుడు విశాల్ పాము నుండి తప్పించుకునే ప్రయత్నంలో తీవ్రగాయాలకు గురైనట్టు కార్మికులు తెలిపారు.

వెంటనే బాధితులను కంపనీ ఆసుపత్రికి, అక్కడి నుండి మంచిర్యాలకు చికిత్స నిమిత్తం తరలించగా, నవీన్ అప్పటికే మృతిచెందగా, విశాల్ ను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించినట్లు సమాచారం. అయితే బాధితులకు న్యాయం చేయాలని బంధువులు, ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement