Thursday, October 24, 2024

WGL | ఆర్టీసీ బస్సులో మహిళ మృతి..

-ఎంజీఎంలో వైద్యం కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో మృతి
కమలాపూర్, అక్టోబర్ 24 (ప్రభ న్యూస్) : ఆర్టీసీ బస్సులో మహిళ మృతి చెందిన ఘటన గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంకిళ్ల కవిత (36) తన భర్త కుమారస్వామి తో కలిసి గత నాలుగు రోజుల క్రితం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళింది. గురువారం ఉదయం ఎంజీఎం ఆసుపత్రి నుండి తన స్వగ్రామానికి వెళ్ళిపోతామంటూ డాక్టర్లను కోరింది.

దాంతో అక్కడి వైద్యులు డిశ్చార్జ్ రాశారు. ఇంటికి తిరుగు ప్రయాణంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఎక్కారు. వంగపల్లి ఆర్టీసీ బస్టాప్ వద్దకు బస్సు చేరుకోగానే భర్త కుమారస్వామి సీట్లో పడుకున్న భార్య కవితను నిద్ర లేపే ప్రయత్నం చేయగా ఆమె ఎంతకీ నిద్ర నుండి లేవకపోవడంతో బస్సులోనే మృతి చెందినట్లు ప్రయాణికుల తో పాటు ఆర్టీసీ సిబ్బంది నిర్ధారణ చేశారు. వంగపల్లి బస్టాప్ వద్ద ఉన్న గ్రామస్తుల సహకారంతో ఆమె మృతదేహాన్ని ఆర్టీసీ బస్సులో నుంచి దించారు. మృతురాలికి ఒక కూతురు, ఇద్దరు కుమారులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement