Friday, October 4, 2024

TG: మంత్రగత్తె నెపంతో మహిళ సజీవదహనం…

రామాయంపేట: మంత్ర గత్తె నెపంతో మ‌హిళ‌ను స‌జీవ‌ద‌హ‌నం చేసిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ద్యాగల ముత్తవ్వ ఇంట్లో ఉండగా గురువారం రాత్రి గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు. మంత్రాల నెపంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.

అరుపులు విని స్థానికులు కొందరు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.

మృతదేహాన్ని పోలీసులు రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. దాడి భయంతో మృతురాలి కుమారుడు, కోడలు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement