హైదరాబాద్ – విన్స్ బయో ప్రొడక్ట్స్ సంస్థ తెలంగాణ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.51 లక్షల విరాళం అందించింది. ఆ సంస్థ చైర్మన్ శ్రీదాస్ నారాయణ దాస్ డాగ, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ డాగ శుక్రవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.
- Advertisement -