Friday, October 18, 2024

NZB | జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా : అంతిరెడ్డి రాజిరెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి (ప్రభ న్యూస్) : జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషిచేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. త‌న‌పై నమ్మకం ఉంచి ఈ పదవి బాధ్యతలు అప్పజెప్పినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర రథసారధి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీమంత్రి, బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర నాయకులకు, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలకంగా పని చేసిన జిల్లాలోని సీనియర్ పార్టీ నేతలను నామినేటెడ్ పదవులు వరిస్తున్నాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అంతిరెడ్డి రాజారెడ్డిని ప్రభుత్వం నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. హైదరాబాదులో గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అంతిరెడ్డి రాజారెడ్డికి మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియామకపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ…. గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశానని చెప్పారు. కష్టపడి పని చేసే వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు తప్పకుండా ఉంటుందని అందుకు నా పదవే నిదర్శనమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement