Friday, September 6, 2024

HYD: భార్య హత్య.. భర్తపైనే అనుమానం..

ఉప్పల్, జులై 12(ప్రభ న్యూస్) : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ భరత్ నగర్ లో వివాహిత హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒరిస్సాకి చెందిన ప్రదీప్ బోలా, మధుస్మిత (28) దంపతులు న్యూ భరత్ నగర్ లో ఒక ఇంట్లో నివాసముంటున్నారు. శుక్రవారం ఆ ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు 100కి డయల్ చేశారు.

ఘటనా స్థలానికి చేరుకొని గది తెరిచి చూడగా.. కుళ్ళిన స్థితిలో మధుస్మిత మృతదేహాన్ని గుర్తించామని, గత కొన్ని రోజులుగా దంపతులు ఇద్దరు గొడవ పడుతున్నట్లు, అదే గొడవ 3 రోజుల క్రితం హత్యకు దారి తీయ్యొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భర్త పరారీలో ఉన్నాడని, సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని అన్ని కోణాల్లో విచారణ చేసి త్వరలో వివరాలు తెలియజేస్తామని ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement