Monday, September 16, 2024

TG: భార్యను కడతేర్చి… భర్త బలవన్మరణం..

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : భార్యపై అనుమానంతో గొంతు కోసి హతమార్చి ఆపై తాను కూడా గొంతు కోసుకొని అక్కడే మృతిచెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సైద్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే సైద్ పూర్ గ్రామానికి చెందిన యేసుల లక్ష్మణ్‌ (34) కు సునీత (30) అనే గిరిజన యువతితో పదేళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. వారికి ఇద్దరు మగ పిల్లలు కూడా. అయితే సునీతకు వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానం పెనుభూతంగా మారింది.

ఆమెతో గొడవపడి సోమవారం పట్టపగలు తన ఇంటి ముందే భార్య సునీత గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. ఆమె రక్తపుటేరులో కొట్టుకుంటూ చనిపోగా, ఇది చూసి చలించిన లక్ష్మణ్‌ అదే కత్తితో తన గొంతు కోసుకొని అక్కడే ప్రాణాలు వదిలాడు. భార్య భర్తలిద్దరూ రక్తపుటేరులో పడి మృతిచెందిన సంఘటన తీరని విషాదం నింపింది. బేల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement