Thursday, September 19, 2024

TG: తాము అధికారంలోకి వచ్చాక అధికారికంగా విమోచన దినం.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ ప్రతినిధి, సెప్టెంబర్ 17 (ప్రభ న్యూస్) : తమ పార్టీ అధికారంలోకి వచ్చాక విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామ‌ని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే నివాసం (గాజుల పేట్) నిర్మల్ లో ఇవాళ‌ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17న అని, కానీ మైనార్టీలకు భయపడి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరు ప్రజాపాలన పేరట, మరొకరు స్వయంపాలన పేరిట కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ఈ రెండు పార్టీ దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు.

- Advertisement -

రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక తామే ప్రభుత్వ పరంగా విమోచన దినాన్ని నిర్వహిస్తామని మరోమారు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు అంజుకుమార్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, అయ్యన్న గారి భూమయ్య, కమల్ నయన్, మెడిసెమ్మ రాజు, అరవింద్, విలాస్, మంగ, రావుల రాంనాథ్, శ్రావణ్ రెడ్డి, సాగర్, భాస్కర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement