Saturday, September 21, 2024

TG | తల్లిని కోల్పోయిన బాలికకు ఆదుకుంటాం : మంత్రి కోమటిరెడ్డి

నిర్మల్ ప్రతినిధి (ప్రభు న్యూస్) : తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన తానూర్ మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన దుర్గ అనే చిన్నారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భరోసా కల్పించారు. ఆయన కుమారుడు ప్రతీక్ పేరిట నిర్వహిస్తున్న ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు.

మంత్రి కోమటిరెడ్డి పాపతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆర్థికసాయం అందించడంతో పాటు చిన్నారికి తను ఎంత వరకు చదివితే అంత వరకు చదివిస్తానని… అన్ని సౌకర్యాలు కల్పించి పెళ్ళి అయ్యేవరకు బాధ్యత వహిస్తానని వెల్లడించారు. నెలనెలా ఖర్చుల కోసం పంపిస్తానని, త్వరలో పాపను కలుస్తానని అన్నారు. ఉండేందుకు ఇల్లు కూడా కట్టిస్తానని వెల్లడించారు. ఘటనపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement