Thursday, September 12, 2024

Warns – హైడ్రా పేరుతో వ‌సూళ్లు .. తాట తీస్తాన‌న్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి


వ‌సూళ్ల పాల్ప‌డే వారిపై ఫోక‌స్
ఎసిబి , విజిలెన్స్ అధికారుల‌కు ఆదేశం
ఏ ఒక‌ర్ని వ‌ద‌ల‌వ‌ద్ద‌న్న ముఖ్య‌మంత్రి..

హైదరాబాద్ – హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని , వారి భ‌రతం ప‌ట్టాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.. కూల్చ‌కుండా, కూలుస్తామ‌ని భ‌య‌పెడుతూ కొంద‌రు భారీగా వ‌సూళ్లు చేస్తున్నార‌ని త‌న‌కు అనేక ఫిర్యాదు అందాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.. దీనిపై స్పందించిన రేవంత్ గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. అటువంటి వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఎవ‌రు ఇటువంటి వ‌సూళ్లకు పాల్ప‌డినా తాట తీసుడే అన్ని హెచ్చ‌రించారు కాగా, ఇలాంటి వ‌సూళ్ల‌కు పాల్ప‌డే వారిపై ఫోక‌స్ పెట్టాల‌ని ఏసీబీ, విజిలెన్స్ అధికారుల‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement