Sunday, September 8, 2024

WGL: రెండు లారీలు ఢీ… ఇద్దరికి గాయాలు

మరిపెడ, జులై 12 (ప్రభ న్యూస్) : ఒకే వైపుగా వెళుతున్న రెండు లారీలు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన మరిపెడ మండలంలోని తండ ధర్మారం శివారు లచ్చితండా గ్రామ పంచాయతీ స్టేజి వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

ఒకే దిశలో రెండులారీలు వెళ్తున్న క్రమంలో ముందుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ లు వేయడంతో గ్రానైట్ లోడుతో వెనుకగా వస్తున్న లారీ ముందు లారీని బలంగా ఢీ కొట్టడంతో గ్రానైట్ లారీ డ్రైవర్ వెంకన్న క్యాబిన్‌ లో ఇరుక్కుపోయాడు. 108 సిబ్బంది సకాలంలో చేరుకొని, క్షతగాత్రులను స్థానికుల సహాయంతో క్యాబిన్ నుండి బయటకు తీశారు. క్లీనర్ నరేష్ కు పాక్షికంగా గాయాలయ్యాయి. వారిరువురిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది ఈఎంటి యాకూబ్ పఠాన్, పైలట్ మధులను స్థానికులు అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement