Thursday, October 24, 2024

WGL: దొంగల బీభత్సం.. భారీగా బంగారం, వెండి అప‌హ‌ర‌ణ‌

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం, బీసీ కాలనీ వెంగల్ రావు వెంచర్ లో బొమ్మకంటి పవన్ కుమార్ ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించి 12 తులాల బంగారం, 16 తులాల వెండి, నగదు రూ. 40వేలు అపహారించుకుపోయినట్లు ఇంటి యజమాని బొమ్మకంటి పవన్ కుమార్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం పని నిమిత్తం భూపాలపల్లికి వెళ్లి సాయంత్రం 4గంటలకు తిరిగి రాగా.. ఇంటి తాళం లేదని, ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు తీసి వస్తువులు చిందర వందరగా పడి వున్నాయని తెలిపాడు.


బీరువాలోని 12 తులాల బంగారంతో పాటు 16 తులాల వెండి, నగదు రూ.40వేలు గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని బాధితుడు పవన్ తెలిపారు. 100కు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీం, భూపాలపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. బాధితుడు శుక్రవారం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement