మంగపేట, జూలై 2 (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం శివారులోని శ్రీఅభయాంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. ఇందుకు సంబందించి వివరాలిలా ఉన్నాయి… ఆలయ అర్చకులు ఈశ్వరానంద్ శర్మ మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చే సరికి ఆలయ ద్వారం వేసిన తాళాలు పగుల గొట్టి ఉన్నాయి.
దీంతో ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆలయంలో జరిగిన చోరీ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియాల్సి ఉంది.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/07/image-8-460x1024.png)
- Advertisement -