Saturday, September 21, 2024

WGL: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ.. ఎమ్మెల్యే గండ్ర‌

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : దేశ ప్రధానిగా స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా మంగళవారం భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టెలికాం, ఐటీ రంగాల్లో మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నేత, దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడని అన్నారు. వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement