Thursday, October 17, 2024

WGL: పుష్కర ఘాట్ కరకట్టను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

ఏటూరునాగారం, జులై 19 (ప్రభ న్యూస్): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద కరకట్టను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ పరిశీలించారు. ములుగు జిల్లాలోని గోదావరి తీర ప్రాంతమైన ఐదు మండలాల్లో ఉన్న గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు.

గోదావరి పరివాహక కరకట్ట మరమ్మతులు చేస్తున్నారని, ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశామని తెలిపారు. మండల కేంద్రంలో ఉన్న అధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు తీర ప్రాంతమైన గోదావరి ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గోదావరి పెరగడంతో వరద నీరు లోతట్టు ప్రాంతాలకు చేరుతోందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement