Tuesday, September 17, 2024

WGL: మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి… ఎమ్మెల్యే గండ్ర

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు సంబంధిత అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పట్టణ బస్టాండ్, మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు దృష్టికి వచ్చిందని నిలవకుండా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా శాశ్వత పరిష్కారం చేయాలని సూచించారు.

పట్టణంలోని పలు ప్రాంతాల్లో సైడ్ డ్రెన్, రోడ్డు లేకుండా ఉన్నాయని వాటిని గుర్తించి నిర్మించడానికి దృష్టి సారించాలని తెలిపారు. పట్టణంలో కుక్కల, కోతుల బెడద ఉండకుండా చూడాలని అన్నారు. వాటితో పాటు వీధి దీపాలు,ప్రతి వార్డులో సురక్షిత త్రాగునీరు అందేలా కృషి చేయాలని, పారిశుద్ధ పనులను మెరుగుపరిచి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని లోతట్టు ప్రాంతాలను గుర్తించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement