Thursday, September 19, 2024

WGL: అల్లుడి దాడి.. మామ మృతి, అత్త పరిస్థితి విషమం

మంగపేట, ఆగస్టు 12 ( ప్రభ న్యూస్) : అత్త, మామలపై అల్లుడు కర్రతో దాడి చేసి కొట్టడంతో మామ మృతిచెందగా, అత్త పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన ప్రకారం… వివరాలిలా ఉన్నాయి. ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేటకు చెందిన గొర్రె నరసయ్య, గొర్రె నర్సక్క దంపతులు తమ కుమార్తె అయిన స్వప్నను అదే గ్రామానికి చెందిన గాంధర్ల మల్లేష్ కు ఇచ్చి సుమారు పదేండ్ల క్రితం వివాహం చేశారు.

కాగా గాంధర్ల మల్లేష్ సుమారు నాలుగేండ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకోవడంతో స్వప్న పుట్టింటికి వచ్చేసి అప్పటి నుండి తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో గాంధర్ల మల్లేష్ రాత్రి విపరీతంగా మద్యం సేవించి మద్యం మత్తులో అత్త మామలైన గొర్రె నరసయ్య, గొర్రె నర్సక్కలపై కర్రతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడు.

దీంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా గొర్రె నరసయ్య (52) అప్పటికే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొర్రె నర్సక్క పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడి బంధువులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement