Friday, September 27, 2024

WGL: విద్యుద్ఘాతంతో గొర్రెలు మృతి…

మరిపెడ, సెప్టెంబర్ 26 (ప్రభ న్యూస్): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలివారి గూడెం గ్రామంలో గురువారం 11 కేవీ విద్యుత్ వైరు తెగి రహదారిపై పడి, గ్రామానికి చెందిన నగినబోయిన.వెంకటేష్ (25) గొర్రెలను మేతకు తీసుకొని వెళుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి పది జీవాలు (ఒక గొర్రెపోతు 9 గొర్రెలు) మృత్యువాత పడ్డాయి.

అందులో నాలుగు గొర్లు సూడి గొర్లు, సుమారు 150000 రూపాయల విలువైన జీవాలు అకాలంగా మృతి చెందడంతో రైతు లబోదిబోమంటున్నాడు. విద్యుద్ఘాతానికి గురైన మనవడు వెంకటేష్ ను హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement