Saturday, October 12, 2024

WGL: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య… ఎమ్మెల్యే గండ్ర

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వసతులతో పాటు దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం ఐఐఐటి బాసరలో సీటు పొందిన నేరేడుపల్లి పాఠశాలకు చెందిన మారెపల్లి అక్షితకు ఎమ్మెల్యే శాలువా కప్పి, పూల బొకే ఇచ్చి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, ఐడి కార్డులను పంపిణీ చేశారు. అనంతరం స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్కూల్లో ఎమ్మెల్యే డీపీవో నారాయణ రావు ఇతర అధికారులు, నాయకులతో కలిసి మొక్కలను నాటారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement