Tuesday, September 17, 2024

TS: మావోయిస్టులపై ప్రజల తిరుగుబాటు… 4వేల మందితో ర్యాలీ

వాజేడు, జూన్ 5, ప్రభ న్యూస్ : అటవీ ప్రాంతంలో మందు పాత్రలు పెడుతూ సామాన్యులను బలిగొంటున్న మావోయిస్టులపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఇటీవల ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొంగల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెట్టిన మందు పాత‌ర‌ పేలి మృతిచెందిన ఇల్లందుల యేసు కుటుంబానికి మద్దతుగా వాజేడు వెంకటాపురం మండలాల నుండి గ్రామ గ్రామాన ప్రజలు కదిలి వచ్చి మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వ‌హించారు. జగన్నాధపురం గ్రామంలో వై జంక్షన్ నుండి హనుమాన్ సెంటర్ వరకు 4000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈర్యాలీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. ప్రజల కోసం పోరాటాలు చేసే మావోయిస్టులు నేడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు నినాదాలు చేశారు. మావోయిస్టులు అమర్చిన మందుపాత‌ర పేలుడు కారణంగా మృతిచెందిన యేసు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement