Friday, September 6, 2024

భీమారంలో దొంగల హల్చల్.. 24 తులాల బంగారం అపహరణ

హసన్ పర్తి, జులై11(ప్రభ న్యూస్) : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం భీమారం గ్రామంలో దొంగలు హల్ చల్ సృష్టించారు. బాధితులు, కాకతీయ యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమారం బొడ్రాయి సమీపంలో నివాసం ఉండే ఎండి సాధిక్ పాషా అనే వ్యక్తి తన కుటుంబంతో ఈనెల 8న హైదరాబాద్ వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా.. ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. బీరువా తాళాలు పగలగొట్టి, ఇంట్లోని 24తులాల బంగారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు కేయూ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని కేయూ పోలీసులు, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజకుమార్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement