Thursday, September 19, 2024

TG | పిచ్చికుక్క స్వైర విహారం… పదిమంది గాయాలు

చిట్యాల,(ప్రభ న్యూస్): జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రమైన వెంకట్రావుపల్లి(సి)లో (గురువారం) పిచ్చికుక్క సైరవిహారం చేసింది. దీంతో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అంతే కాకుండా పలు పశువులను కరిచింది.

దీంతో ఆ పిచ్చి కుక్కను గ్రామస్తులు తరిమికొట్టారు. పిచ్చికుక్కల దాడిలో గాయపడిన వ్యక్తులు చికిత్స నిమిత్తం సివిల్‌ ఆసుపత్రికి వెళ్లారు. గ్రామాల్లో కుక్కల బెడద విజృంభిస్తోందని, వాటి బారి నుంచి రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement