Saturday, September 21, 2024

భారీగా గుట్కాల‌ పట్టివేత

మొగుళ్ళపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి గ్రామ శివారులోని చిట్యాలకు వెళ్లే దారిలో ఈరోజు వాహనాలు తనిఖీ చేస్తుండగా భారీగా గుట్కాలు ప‌ట్టుబ‌డ్డాయి. పెనుగొండ శంకర్, ఆటో డ్రైవర్ కాంకానాల రాజు లు ఆటోలో రూ. 2 లక్షల 13 వేల విలువైన ఐదు అంబార్ బస్తాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా అంబర్ ఫ్యాకెట్లు తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకుని వారిద్దరితో పాటు నడికూడా మండలం వరికోల్ కు చెందిన పటేల్ మల్లేశ్ (పిట్ట మల్లేష్) ల పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement