Friday, October 25, 2024

WGL | సాంకేతిక లోపంతో నిలిచిపోయిన గూడ్స్ రైలు

విజయవాడ- కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం
తాళ్లపూసపల్లి రైల్వే రంగాపురం స్టేషన్ ల మధ్య సాంకేతిక లోపంతో నిలిచిపోయిన గూడ్స్ రైలు


కేసముద్రం, అక్టోబర్ 25(ఆంధ్రప్రభ ): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ రంగాపురం గేట్ మధ్య ఓ గూడ్స్‌ రైలు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ రంగాపురం గేట్ మధ్య ఓ గూడ్స్‌ రైలు ఇంజన్ లో వచ్చిన సాంకేతిక సమస్యతో అప్ లైన్ లో శుక్రవారం ఉదయం 8గంటల నుండి 9.15 వరకు నిలిచిపోయింది. దీంతో సమాచారం అందుకున్న రైల్వే అధికారులు కేసముద్రం రైల్వే స్టేషన్ లో ఆగిఉన్న మరో గూడ్స్ రైలు ఇంజన్ ను పంపించి… నిలిచిపోయిన గూడ్స్ రైలుకు వెళ్లిన ఇంజన్ తో నెక్కొండ వరకు పంపించారు. నిలిచిపోయిన గూడ్స్ రైలు కారణంగా పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement