Tuesday, October 22, 2024

WGL: అనాధ శరణాలయంలో బాలిక అదృశ్యం..

న్యూ శాయంపేట, అక్టోబర్ 22 (ఆంధ్ర ప్రభ) : గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ న్యూ శాయంపేట ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో హోప్ చిల్డ్రన్స్ హోమ్స్ నడుస్తోంది. ఇటీవల నగరంలోని పలివెల్పులకు చెందిన అన్విత శ్రీ అనాధ శరణాలయంకు వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున అనాధ బాలిక తప్పించుకొని.. న్యూస్ శాంపేట రైల్వే ట్రాక్ వద్దకు వచ్చింది.

అక్కడే ఉన్న స్థానికులు చూసి అమ్మాయి వివరాలు అడగగా ఏమి చెప్పకుండా.. న్యూ శాయంపేట సర్కిల్ పరిగెత్తుకుంటూ వచ్చింది. అంతలోనే.. మున్సిపాలిటీకి చెందిన జవాన్ ఇంద్రసేన, సిబ్బంది ఆ అమ్మాయి వివరాలను తెలుసుకొని.. సుబేదారి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అనాధ శరణాలయం నుండి అనాధ బాలిక ఎందుకు తప్పించుకుని వచ్చిందో కారణం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement