Wednesday, October 16, 2024

WGL: మహిళల ఆర్థికాభివృద్ధే ఫౌండేషన్ లక్ష్యం…

కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలు బుట్ట దాఖలు….
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
జనగామ, ప్రభ న్యూస్ : మహిళల ఆర్థికాభివృద్ధే పోచంపల్లి ఫౌండేషన్ లక్ష్యమ‌ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. బుధవారం శ్రీ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు కేటీఆర్ జన్మదినం సంద‌ర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మహిళల ఆర్థిక అభివృద్ధి ఉపాధి లక్ష్యంగా పోచంపల్లి ఫౌండేషన్ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పంపిణీ చేయడం శుభపరిణామమన్నారు. ఆనాడు టీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో మహిళల ఆర్థిక అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పెద్దపీట వేశారన్నారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి మరచి మాటల గ్యారడీల‌తో ప్రజలను మోసం చేస్తూ బుట్ట దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లింగాల గణపురం ఎంపీపీ చిట్ల జయశ్రీ, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బసవని శ్రీనివాస్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement