Saturday, September 14, 2024

TG: జాతీయ జెండాను ఆవిష్క‌రించిన మాజీ ఎమ్మెల్యే న‌న్న‌పునేని

78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రంగశాయిపేట సబ్ స్టేషన్ వద్ద ఉన్న వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ స్థలంలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణలో తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈసంద‌ర్భంగా నరేందర్ మాట్లాడతూ… దేశం, రాష్ట్రం ఉన్నతంగా ఎదగడంలో అందరం భాగస్వాములవుదామని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత, లింగ వర్ణ బేధాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు సాగుతామ‌ని, స్వరాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో 10సంవత్సరాలు చాలా ఘనంగా జరుపుకున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్ర, వరంగల్ తూర్పు ప్రజలందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నరేందర్.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వనా శమిమ్ మాసూద్, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, మారుపల్ల రవి, టి.రమేష్ బాబు, కుందారపు రాజేందర్, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇంచార్జ్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement