Tuesday, July 2, 2024

WGL: విద్యుత్ షాక్ తో ఐదు ఆవులు మృతి..

మల్హర్, జూన్ 27(ప్రభ న్యూస్): జయశంకర్ జిల్లా మలహర్ రావు మండలంలోని కొండంపేట గ్రామపంచాయతీలో గురువారం రైతు తెప్పెల మధుసూదన్ చెందిన ఐదు పాడి జెర్సీ ఆవులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాయి. మేతకు వెళ్లిన ఆవులు నేలపై వున్న విద్యుత్ వైరుకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాయని గ్రామస్తులు తెలిపారు.

రైతు పాలకేంద్రం పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. మృతిచెందిన ఐదు పాడి ఆవులు రూ.3లక్షలతో గత ఐదు నెలల క్రితం మహారాష్ట్రలో కొనుగోలు చేశామని రైతు తెలిపారు. ఇటీవల గాలి వానకు విద్యుత్ వైర్లు నేలవాలగా విద్యుత్ అధికారులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యంతో ఆవులు మృతి చెందాయని, మృతిచెందిన పాడి ఆవులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement