Friday, September 20, 2024

WGL: రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలి..

రైతుల ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
చిట్యాల, ఆగస్టు 22 (ప్రభ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ఎన్నికల హామీలో భాగంగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో రుణమాఫీ చేయాలని నాయకులతో కలిసి ఆయన ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ప్రధాన రహదారిపై ధర్నా చేయడంతో వాహనాలు ఎక్కడిక‌క్క‌డ నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారి ధర్నా, నిరసన కార్యక్రమాన్ని విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement