Saturday, September 21, 2024

WGL: విద్యుద్ఘాతంతో వృద్ధురాలు మృతి..

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామంలో మంగళవారం విద్యుద్ఘాతంతో పబ్బోజు కౌసల్య (75) అనే వృద్ధురాలు మృతిచెందింది. ఇంటి ఆవరణలో వున్న రేకుల షెడ్డుకు ఉన్న బల్బ్ హోల్డర్ వైర్ తెగి రేకుల షెడ్డుకు తగిలివుంది.

అది గమనించని కౌసల్య షెడ్ లోని ఇనుప వైరుతో కట్టిన దండెంపై బట్టలు ఆరవేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కౌసల్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుమకున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement